అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం. జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో వేలమంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు. డిగ్రీలు పూర్తిచేసి సరైన ఉద్యోగం లభించక తీరా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పోషణ మరియు కుటుంబ పోషణ భారంగా మారింది. కొన్ని కుటుంబాలు ఏదో ఒక పని చేస్తే గాని గడవని పరిస్థితిలో ఉన్నాయి.
అలాంటి వారి కోసం జిల్లాలోని వివిధ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయడం కోసం నగరంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుగొండ మండలంలో గల పరిశ్రమ నందు మరియు ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు నందు అసెంబ్లీ లైన్ ఆపరేటర్ భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ లిమిటెడ్ అక్రాస్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారి బ్రాంచ్లలో లోన్ ఆఫీసర్గా ఉద్యోగాలలో భర్తీ చేయడం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.వీటికి అర్హతగా పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమో ఐటిఐ మరియు డిప్లమో లో ఏదైనా బ్రాంచ్అ ర్హతగా నిర్ణయించారు. ఇందులో అర్హత కలిగిన శ్రీమతి యువకులు పాల్గొనవచ్చు. మరియు వీరి వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అర్హతగా తెలిపారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఈ ప్రవేట్ కంపెనీలలో ఎక్కడైనా ఉద్యోగం చేసేలా ఉండాలని తెలిపారు.
ఈ కంపెనీలలో ఉద్యోగం సాధించిన వారికి 13 వేల రూపాయలు నుంచి 20 వేల రూపాయల వరకు జీతంఅందిస్తారు. వీటికి అర్హత గల వారు 17 అక్టోబర్ 2023 ఉదయం 9 గంటలకి ఏపీఎస్ఎస్డిసి డిస్టిక్ ఆఫీస్ అనంతపురం వద్ద జరుగుతున్న మినీ జాబ్ మేళాలో పాల్గొనాలని తెలిపారు
0 comments:
Post a Comment