భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్పూర్లోని సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్.. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోల్ మైనింగ్లలో పని చేయుటకు 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి..అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు మైనింగ్ సిర్దార్ షిప్ సర్టిఫికెట్/ఫస్ట్ ఎయిడ్ అండ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్/సర్వే సర్టిఫికేట్/సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు: జనవరి 30, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1180 లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
జీతం: అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,852 ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment