Mega DSC | మెగా డీఎస్సీ కోసం కసరత్తు

రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్‌సి నోటిఫికేషన్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్‌సి ఫైలుపైనే చేయనున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తిచేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. 12వ తేదినే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిషికేషన్‌లో 6,100 పోస్టులే ఉండగా, తాజాగా 13 నుండి 15 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిషికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాత నోటిఫికేషన్లోని 6,100 పోస్టుల్లో 2,280 ఎస్‌జిటి 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌, 1264 టిజిటి, 215 పిజిటి, ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి.

దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌కు 2,67,559 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్‌ నేపధ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్ధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top