ఆధ్రప్రదేశ్ జూన్ 25 నిన్న (సోమవారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.జిల్లాల వారీగా పోస్టులు..మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
16,347 DSC పోస్టులకు జూలై
1వ తేదీన షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాల వారిగా ఖాళీలను ప్రకటించింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583,విశాఖ 1134, తూర్పు గోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా 1213, గుంటూరు 1159,ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2678 ఖాళీలు
ఉన్నాయి ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.కాగా, జూలై 1వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి
డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment