ఈ మెగా జాబ్ మేళాలో ఎంపికైన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం నెల జీతం ఇస్తారు. 25 కంపెనీల బృందం ఈ జాబ్ మేళాకు రానుంది. దీంతో చుట్టుపక్కల నిరుద్యోగులకు తీపికబురు అని చెప్పుకోవచ్చుమీరు జాబ్ కోసం చూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పుత్తూరు పట్టణంలోని ఎస్ ఆర్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ మెగా జాబ్ మేళా నందు 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులు ఎంపిక చేయనునట్లు వివరించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని సూచించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు అభ్యర్థులు సర్టిఫికెట్స్, ఐడి ప్రూఫ్తో రావాలన్నారు.
వివరాల కోసం 6300954441, 6304330520 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎంపిక అయిన వారికి ఆ కంపెనీ రూల్స్ ప్రకారం నెల జీతం ఇస్తారని తెలిపారు. 25 కంపెనీల బృందం పుత్తూరుకు రావడం చుట్టుపక్కల నిరుద్యోగుల అదృష్టంగా భావించి త్వరపడాలని కోరారు
0 comments:
Post a Comment