Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ మేళా, రూ.25 వేల జీతం పొందొచ్చు!

విశాఖపట్నం కంచరపాలెంలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ నందు ఈ నెల (నవంబర్) 3వ తేదీన జాబ్ మేళా నిర్వహించున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయి కృష్ణ చైతన్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు 200 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ జాబ్ మేళా లో టెక్విస్సేన్ సాఫ్ట్వేర్, డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్, యోకోహమా టైర్స్, రావోల్స్ ఇండస్ట్రీస్, ఎస్.ఆర్. షాపింగ్ మాల్ పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తాయని తెలిపారు. టెక్విస్సేన్ సాఫ్ట్వేర్లో ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత అయిన 25 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం గంభీరంలో వర్క్ లొకేషన్ ఉంటుందని, నెలకు రూ.16000 నుండి రూ. 20000 వరకు జీతం ఉంటుందని తెలిపారు. అలాగే డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్ లో డిప్లొమా లేదా బీటెక్ లో ఎలక్ట్రిక్రల్, మెకానికల్, ఇన్సుమెంటేషన్, కెమికల్ మరియు ఎంఎస్సిమైక్రో బయాలజీ లేదా బయో టెక్నాలజీ లలో 2022 మరియు 2023 అకాడమిక్ సంవత్సరంలో ఉత్తీర్ణత అయి ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్స్ లేకుండా పదవతరగతి నుండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top