DSc: 'డీఎస్సీ'కి బీటెక్‌-బీఈడీ అభ్యర్థులూ అర్హులే, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

బీఈడీ పూర్తిచేసిన బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇక నుంచి వారుకూడా టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(టీఆర్టీ)కి అర్హులే అని తెలిపింది. తాజాగా వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అక్టోబరు 11న ఉత్తర్వులు జారీ చేశారు. 

బీటెక్ విద్యార్థులకు 2015 సంవత్సరం నుంచే బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. వారికి 2017లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. ఇటీవల 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ గణితం, భౌతికశాస్త్రం పోస్టులకు వారు పోటీపడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వారికి ఒకట్రెండు రోజుల్లో అవకాశం ఇవ్వనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top