బారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవాళ్లు గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు సొంతం చేసుకోవచ్చు.ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్ టెస్టు ఆబ్జెక్టివ్ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
జనరల్ డ్యూటీ, టెక్నికల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి స్టేజ్-1లో.. ఇంగ్లిష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఒక్కో సబ్జెక్టులోనూ 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.రుణాత్మక మార్కులు లేవు. లా విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు నేరుగా స్టేజ్-2 రాసుకోవచ్చు.
జనరల్ డ్యూటీ, టెక్నికల్ విభాగాల్లో స్టేజ్-1లో అర్హత సాధించినవారికి స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్టు (సీసీబీటీ), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు (పీపీఅండ్డీటీ) ఉంటాయి. సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పీపీ అండ్ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో మాట్లాడాలి.
స్టేజ్-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్-3 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్-3లోనూ మెరిస్తే స్టేజ్-4లో భాగంగా మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నిలిచినవారికి స్టేజ్-5లో భాగంగా స్టేజ్-1, 3ల్లో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్సైట్లో ప్రకటిస్తారు.
అర్హతలు
పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్)
1) జనరల్ డ్యూటీ (పురుషులు)
ఖాళీలు: 25
అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
వయసు: అభ్యర్థులు 01.07.1998 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.
2) టెక్నికల్ పురుషులు (మెకానికల్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్)
ఖాళీలు: 20
అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్. అలాగే ఇంటర్ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి.
వయసు: 01.07.1998 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.
3) లా (పురుషులు, మహిళలలు: 1 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ.
వయసు: 01.07.1993 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి. పై అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 157 సెం.మీ. ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.వీరికి ఐఎన్ఏ, ఎజమాళలో 22 వారాల శిక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి తొలి నెల నుంచే రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్ద్దేశం చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తులు: సెప్టెంబరు 15 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్-1 డిసెంబరులో, స్టేజ్-2 జనవరిలో నిర్వహిస్తారు.
వెబ్సైట్:https://joinindiancoastguard.cdac.in/cgcat/
0 comments:
Post a Comment