భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పత్తి సేకరణ, బిజినెస్, మార్కెటింగ్పై దృష్టిసారిస్తుంది. CCIL తాజాగా మేనేజ్మెంట్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ cotcorp.org.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ జులై 24న ప్రారంభం కాగా, ఆగస్టు 13న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్తో సీసీఐ 93 ఖాళీలను భర్తీ చేస్తుంది.
* ఖాళీల వివరాలు
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-81 మేనేజ్మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-6
మేనేజ్మెంట్ ట్రైనీ(అకౌంట్స్)-6
* అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారుల వయసు 2023 జులై 24 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc అగ్రికల్చర్ పాసై ఉండాలి. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 45 శాతం స్కోర్ చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించాలి. మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) పోస్టులకు కామర్స్, ఫైనాన్స్లో పీజీ పూర్తిచేసి ఉండాలి. లేదా సీఏ (చార్టెడ్ అకౌంటెన్సీ), సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (CMA) వంటి కోర్సులు క్వాలిఫై అవ్వాలి. K
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్ www.cotcorp.org.in ఓపెన్ చేయాలి.
- హోమ్పేజీలోకి వెళ్లి సీసీఐ రిక్రూట్మెంట్-2023 అనే లింక్పై క్లిక్ చేయాలి. కొత్త పేజీలో వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- తర్వాత రిజిస్టర్ ఐడీతో అర్హత ఉన్న ఉద్యోగానికి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ను సబ్మిట్ చేయాలి
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రాత పరీక్ష, రెండో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సీసీఐ త్వరలో ప్రకటించనుంది.
* జీతభత్యాలు
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.22000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుంది. మేనేజ్ మెంట్ ట్రైనీ(మార్కెటింగ్), మేనేజ్మెంట్ ట్రైనీ(అకౌంట్స్) అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం ఉంటుంది
0 comments:
Post a Comment