Agneepath Recruitment Rally 2022: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత కోసం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని (Agnipath Recruitment Rally) విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళలం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం విశాఖపట్నంలో ఎంపికను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
ఈ ఎంపికలు.. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరులకు సంబంధించిన సెలక్షన్ ను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలుంటే.. 0891-2756959, 0891-2754680 నంబర్లను సంప్రదించవచ్చని రక్షణ శాఖ అధికారులు సూచించారు.ఇదిలా ఉంటే.. సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ను (Agnipath) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ నేవీ (Indian Navy) అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ (Registration)ను జూలై 1న ప్రారంభించింది. అయితే ఈ రిక్రూట్మెంట్కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోర్టల్ను ఓపెన్ కొద్ది రోజుల్లోనే దాదాపు 10,000 మంది మహిళలు ఈ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం.. భారత నౌకాదళం అగ్నిపథ్ (Agnipath) రిక్రూట్మెంట్ పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 1న ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జులై 15 నుంచి జులై 30 వరకు కొనసాగనుంది. నావికా దళంలో సెయిలర్ పోస్టులకు మహిళలను రిక్రూట్ చేసుకోవడం ఇదే మొదటిసారి
0 comments:
Post a Comment