కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. రానున్న ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రిక్రూట్ ప్రక్రియను వేగవంతం చేసేందుకుగాను నిరంతర ప్రయత్నాలు చేసిన కమిషన్ ఆయా పరీక్షల నోటీసులను వెబ్సైటులో అప్లోడ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైటు www.sss.nic.in చూడాలని కోరింది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
0 comments:
Post a Comment