వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్ లో కావలసిన వారు కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
APSRTC లో అప్రెంటీస్ నిమిత్తం నోటిఫికేషన్
వివిధ ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయిన అర్హులైన అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీలో అప్రంటీస్షిప్ కోసం ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ విజయనగరం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాబిందు ఒక ప్రకటనలో తెలిపారు.ఈమేరకు అభ్యర్థులు అప్రంటీస్ షిప్ ఇండియా.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో జూలై 4వ తేదీలోపు అప్రంటీస్షిప్ కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇదే ఆఖరు రోజు అని తెలిపారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో డీజిల్, మోటార్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, విశాఖపట్నం జిల్లాలో డీజిల్, మోటార్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, షీట్మెటల్, పెయింటర్, మేచినిస్ట్, ఫిట్టర్, డ్రాప్టుమెన్ సివిల్ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో డీజిల్, మోటార్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీజిల్, విజయనగరం జిల్లాలో డీజిల్, మోటార్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, పెయింటర్, మిల్రైట్ మెకానిక్, మెచినిస్ట్, డ్రాఫ్ట్సుమెన్ సివిల్, మన్యం పార్వతిపురం, శ్రీకాకుళం జిల్లాల్లో డీజిల్, మోటార్, ఎలక్ర్టీషియన్, వెల్డర్, షీట్మెటల్ ట్రేడ్లులో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. జూలై 4వ తేదీలోగా ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న ఆయా జిల్లాల అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా నిర్ణీత తేదీల్లో ఉదయం 10 గంటలకు విజయనగరంలోని వీటీ అగ్రహారం, ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వద్దకు హాజరుకావాలని తెలిపారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల అభ్యర్థులు జూలై 6న, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వారు జూలై 7న, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల వారు జూలై 8వ తేదీన హాజరుకావాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా ఆయా జిల్లాల ప్రభుత్వ ఐటీఐ అప్రంటీస్షిప్ అడ్వైజర్ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు. సమాచారం కోసం 08922-294906కు కార్యాలయం పనివేళల్లో ఫోన్చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు సెలక్టు అయిన, అప్రంటీస్షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకానవసరం లేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment