న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సరిహద్దు భద్రతా దళం (BSF) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 281 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మాస్టర్, డ్రైవర్, వర్క్షాప్ విభాగాల్లో ఎస్ఐ, హెడ్కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 281
ఇందులో ఎస్ఐ 16 (మాస్టర్ 8, ఇంజిన్ డ్రైవర్ 6, వర్క్షాప్ 2), హెడ్కానిస్టేబుల్ 135 (మాస్టర్ 52, ఇంజిన్ డ్రైవర్ 64, వర్క్షాప్ 19), సీటీ 130 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఇంటర్ పాసవ్వాలి. ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 22 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నెల 21న ప్రకటన విడుదలైంది. ప్రకటన విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
వెబ్సైట్: https://rectt.bsf.gov.in
0 comments:
Post a Comment