సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు ఆగస్టు 20న విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. జులైలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులు ఎంపిక చేశారు. పీఈటీ / పీఎస్టీ ఫలితాలు జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బల 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్మ్యన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్ఎస్సి ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే నెలలో నిర్వహించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment