బీటెక్ పూర్తి చేశారా? అయితే మీకు శుభవార్త. బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం. ఎంపికైతే నెలకు రూ. 56 వేల జీతం ఇస్తారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) తాజాగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. మరి దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఇతర వివరాలు మీ కోసం.
పోస్టు వివరాలు:
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
మొత్తం ఖాళీలు: 325
ఇంజనీరింగ్ బ్రాంచ్ వారీగా ఖాళీలు:
మెకానికల్: 123
కెమికల్: 50
ఎలక్ట్రికల్: 57
ఎలక్ట్రానిక్స్: 25
ఇన్స్ట్రుమెంటేషన్: 25
సివిల్: 45
అర్హతలు:
బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసిన అభ్యర్థులు అర్హులు.
కనీసం 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గేట్-2021 లేదా గేట్-2022 లేదా గేట్-2023 పరీక్ష రాసి ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక:
గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
స్టైపెండ్, అలోవెన్సులు, అకామిడేషన్ వివరాలు:
ట్రైనింగ్ లో స్టైపెండ్: నెలకు రూ. 55,000/-
అలోవెన్సులు: రూ. 18 వేలు
అకామిడేషన్ కంపెనీనే ఇస్తుంది.
ట్రైనింగ్ పూర్తయితే:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నుంచి సైంటిఫిక్ ఆఫీసర్ గా నియమిస్తారు.
సైంటిఫిక్ ఆఫీసర్ జీతం:
నెలకు రూ. 56,100/-
అలోవెన్సులు:
రవాణా అలోవెన్సులు
హౌజ్ రెంట్ అలోవెన్సు లేదా లీజ్డ్ అకామిడేషన్ సదుపాయం లేదా హౌజింగ్
సైట్ లొకేషన్ అలోవెన్సు
ప్రొఫెషనల్ అప్డేట్ అలోవెన్సు (ఏడాదికొకసారి)
ఇతర ప్రయోజనాలు:
లీవ్ ట్రావెల్ అలోవెన్సు
లీవ్ అండ్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్
ఉద్యోగి మరియు అతని మీద ఆధారపడి ఉన్న వారికి మెడికల్ సదుపాయం
పట్టణ పరిధిలో పిల్లల చదువుకు సహకారం
కేబుల్ టీవీ, మొబైల్ ఫోన్ రీఛార్జులు, న్యూస్ పేపర్ ఛార్జీలు, ప్రొఫెషనల్ సంస్థలో మెంబర్ షిప్ ఉంటే దాని ఛార్జీలు కంపెనీ చెల్లిస్తుంది.
క్యాంటీన్ సబ్సిడీ ఉంటుంది.
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 11 ఉదయం 10 గంటల నుంచి
దరఖాస్తు చివరి తేదీ: 28/04/2023 సాయంత్రం 4 గంటల వరకూ
దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీ: 11/04/2023 నుంచి 28/04/2023
దరఖాస్తు ఫీజు: స్త్రీలకు, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మేన్, రక్షణ సిబ్బంది చనిపోయి అనాథలుగా ఉన్న వారికి: రూ. 0/-
జనరల్ అభ్యర్థులకు: రూ. 500/-
0 comments:
Post a Comment