భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
కానిస్టేబుల్(ట్రేడ్స్మెన్) పోస్టులు
మొత్తం ఖాళీలు: 1284 (మెన్: 1220, ఉమెన్: 64)
విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్; తదితరాలు.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎస్క్యూఎఫ్ లెవల్-1 కోర్సు పూర్తి చేయాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాతి దశలో అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి. కానీ అందుకు ఎలాంటి మార్కులు ఉండవు.
జీతభత్యాలు: నెలకు రూ.21700-రూ.69100 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.03.2023.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment