TRT Notification: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ సెప్టెంబరు 7న విడుదలైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 20 నుంచి 30వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు...
➥ ఆదిలాబాద్: 275
➥ ఆసిఫాబాద్: 289
➥ భద్రాద్రి కొత్తగూడెం: 185
➥ హనుమకొండ: 54
➥ హైదరాబాద్: 358
➥ జగిత్యాల: 148
➥ జనగాం: 76
➥ జయశంకర్ భూపాలపల్లి: 74
➥ జోగులాంబ: 146
➥ కామారెడ్డి: 200
➥ కరీంనగర్: 99
➥ ఖమ్మం: 195
➥ మహబూబాబాద్: 125
➥ మహబూబ్ నగర్: 96
➥ మంచిర్యాల: 113
➥ మెదక్: 147
➥ మేడ్చల్: 78
➥ ములుగు: 65
➥ నాగర్ కర్నూల్: 114
➥ నల్గొండ: 219
➥ నారాయణపేట: 154
➥ నిర్మల్: 115
➥ నిజామాబాద్: 309
➥ పెద్దపల్లి: 43
➥ రాజన్న సిరిసిల్ల: 103
➥ రంగారెడ్డి: 196
➥ సంగారెడ్డి: 283
➥ సిద్దిపేట: 141
➥ సూర్యాపేట: 185
➥ వికారాబాద్: 191
➥ వనపర్తి: 76
➥ వరంగల్: 138
➥ యాదాద్రి: 99
0 comments:
Post a Comment