Paytm Recruitment 2021: పేటీఎం లో ఉద్యోగాలు 20,000 పదో తరగతి పాస్ అయితే చాలు....

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్​ఫామ్ పేటీఎం దేశ వ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ సంస్థ చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్​ను స్వీకరించేలా, వారికి అవగాహన కల్పించేందుకుగానూ దేశవ్యాప్తంగా 20 వేల మంది ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తోంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే.. ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేతనంతో పాటు కమిషన్ కలుపుకొని నెలకు రూ.35 వేలు సంపాదించుకొనే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.దీని ద్వారా చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుందని.. ముఖ్యంగా కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశం కానుందని ఆయా వర్గాలు చెప్పాయి
ఉద్యోగ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండిhttps://t.me/apjobs9

వివిధ రకాల నోటిఫికేషన్స్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/HcvNAKeySj6JdtVUsJPXzo

Online Apply Link: https://paytm.com/fse

Posted in:

Related Posts

4 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top